శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో మంత్రులు సత్య కుమార్, సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పాల్గొన్నారు. గ్రామస్థులు మంత్రులు, ఎంపీకి స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ప్రసాదాలు అందించారు.