తాళ్లరేవు 216 జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి . ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆ ప్రాంత వాసులతో పాటు జడ్పిటిసి సామ్యూల్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఏడాదిలో ఈ రహదారిపై సుమారు 12 మంది మృతి చెందారని రహదారిని నాలుగు లైన్లు అభివృద్ధి పరచాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు