నగరి మున్సిపాలిటీ పరిధిలోని కె. వి. ఆర్ పేటలో శనివారం మాజీ మంత్రి రోజా పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, స్థానిక రాజకీయ పరిస్థితులపై నాయకులు రోజాకు వివరించారు. పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు.