రంగారెడ్డి జిల్లా మనసురాబాద్ డివిజన్ పరిధిలోని సిఆర్ ఎంక్లేవ్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయం చుట్టూ సిసి రోడ్డు పనులను కార్పోరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి గురువారం పరిశీలించారు. కార్పొరేటర్ రానున్న విజయదశమి వేడుకల నేపథ్యంలో రూ.4.30 లక్షలతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.