కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల నుండి నేరుగా వినతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి 73 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వెంటనే వాటిని పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు తెలిపారు. పెండింగ్లో లేకుండా చూడాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.