కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఈరక్క అనే మహిళ అదృశ్యమైంది. గత వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ కొరకు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు శనివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈరక్క అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరక్క ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.