నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శుక్రవారం గాజుల సవ్వడి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకుంటూ సందడి చేశారు. అనంతరం పసుపు, కుంకుమలతో వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మన హిందూ సనాతన ధర్మంలో వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం తరతరాల నుండి వస్తుందన్నారు.