బాపట్ల పట్టణంలోని నరాల శెట్టి వారి పాలెంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద శుక్రవారం లడ్డు వేలంపాట నిర్వహించారు. లడ్డు పాటను సదరు వార్డుకు చెందిన ఓ భక్తుడు రూ. 72,000 వెచ్చించి స్వామివారి లడ్డును దక్కించుకున్నారు. అనంతరం స్వామివారిని ట్రాక్టర్ పై ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. ఈ సంవత్సరం బాపట్ల పట్టణంలో అత్యధిక ధర పలికిన లడ్డూగా నరాల శెట్టి వారి పాలెం నిలవడం విశేషం.