గణనాథుడికి పూజలు చేసిన ముస్లిం దంపతులు స్తానిక ఘంటసాల మండలంలో మత సామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలో జలదీశ్వర గణేష్ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో ముస్లిం దంపతులైన షేక్ బాషా-షర్మిల ప్రత్యేక పూజలు చేశారు. పీటలపై కూర్చుని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఘటనస్థానికులందరినీ ఆకట్టుకుంది. పండుగల విషయంలో మత బేధాలు లేకుండా అందరూ కలిసి మెలిసి ఉండాలనే సందేశాన్ని ఈ దంపతులు చాటి చెప్పారని స్తానికులు వాపోయ్యారు.