అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో 6వ రోజు సోమవారం అత్యంత వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి.వినాయక చవితిని పరిష్కరించుకుని వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం 6వ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఆయా ప్రాంతాలలో చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.వినాయకుని చేతిలో పూజలందుకున్న లడ్డూలను వేలం పాటలు నిర్వహించారు. కలికిరి మండలం కలికిరి పంచాయతీలో రెడ్డివారిపల్లి వద్ద గల వినాయకుని చేతిలో పూజలందుకున్న లడ్డూను వేలం పాటలో కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని కైవసం చేసుకున్నారు