ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. దీంతో CWC అధికారులు మంగళవారం సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రస్తుతం పుష్కర ఘాట్ వద్ద 14.36 మీటర్ల మేర గోదావరి నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్నారు.