అమలాపురం పట్టణ పరిధిలోని స్థానిక గడియారం సెంటర్లో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని ఆది గణపతి వర్తక సంఘం ఏర్పాటు చేసిన 'దీవించే వినాయకుడు' విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహంలో రూ.5 నాణెం వేస్తే వినాయకుడు ఆశీర్వదిస్తాడు. దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విగ్రహాన్ని దర్శించుకుని, చిన్నారులు ఆశీస్సులు తీసుకుంటున్నారు