ఎరువులు బ్లాక్ మార్కెట్లోకి తరలిపోకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జమ్మలమడుగు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం యూరియా కొరతపై సిపిఐ నాయకులు నిరసన తెలియజేశారు.అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న యూరియా కొరత తీర్చాలని, ఎరువుల కేటాయింపులో రైతు సేవ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.