జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10వ తేదీన వెలువరించడం జరుగుతుందని పేట అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను తెలిపారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం 4 గం సమయంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ముసాయిద జాబితా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.