ఏటూరునాగారం మండలం దొడ్ల- మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు మళ్లీ ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతుండడంతో ప్రవాహం పెరిగింది. బుధవారం మధ్యాహ్నం మల్యాల, కొండాయి, గోవిందరాజు కాలనీ, ఐలాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో వాగు ఉధృతి తగ్గి రాకపోకలు సజావుగా కొనసాగాయి. కాగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగి అంతరాయం ఏర్పడింది.