ఆసిఫాబాద్ మండలం వావుధం గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ పంచాయతీ భవనంలో చదువుకుంటున్నారని డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్షుడు టీకానంద్ గురువారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త భవనం మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పునాది దశలోనే ఆగిపోయాయని అన్నారు. తక్షణమే పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.