శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ఆదివారం ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం ఉదయం తిరిగి ఆలయాన్ని తెరిచి ఆలయం మొత్తం సంప్రోక్షణ చేసి పూజలు జరిపి భక్తులకు స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు.