పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామంలోని పేకాట స్థావరంపై బుధవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దాడుల నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 34,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ ఎక్కడైనా పేకాట ఆడుతుంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.