శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వరి పొట్టుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. కదిరి నుంచి అనంతపురం వైపు ఈ లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. వీరిని స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.