నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పటిష్టమైన పునాదులు వేస్తూ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… జమ్మిచెట్టు, సంకల్బాగ్, ఓల్డ్ పంప్హౌజ్ వద్ద ఉన్న ఎస్టీపీల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలు చేపట్టాలని సూచించారు. మరో ఎస్టీపీ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.అలాగే ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఐదు మైదానాల్లో క్రీడా సౌకర్యా