నాగలాపురంలో దగ్గర ఒకరి మృతి నాగలాపురం గ్రామానికి చెందిన డి.వేలు (40) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పిచ్చాటూరులోని ఓ హోటల్లో సప్లయర్గా పనిచేస్తున్న ఆయన పని ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరాడు. నాగలాపురం బైపాస్ సమీపంలోనే చెల్లాతమ్మ ఆలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని సంఘటనా స్థలంలో మృతిచెందాడు. ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.