అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో నరసాపురం గ్రామానికి చెందిన శ్రీరాములరెడ్డి అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.