Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: వికలాంగుల పెన్షన్లను పెంచాలని కలెక్టరేట్లోకి దూసుకెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Mancherial, Mancherial | Sep 8, 2025
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వికలాంగుల పెన్షన్లను పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం గేట్లు ఎక్కి కలెక్టర్ ఛాంబర్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు. వికలాంగులకు 6000, వృద్ధులకు, వితంతువు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఇస్తానని అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us