వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో విధులకు డుమ్మా కొట్టిన ఇద్దరు వైద్యులపై తక్షణ చర్యలకు స్థానిక ఎమ్మెల్యే, చీఫ్విప్ జీవీ ఆంజనేయులు సిఫార్సు చేశారు. కేవలం హాజరుపట్టీలోసంతోకాలు పెట్టిన త ర్వాత గైర్హాజరు అవుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడాదిగా ప్రభుత్వాస్ప త్రుల్లో సౌకర్యాలు, వైద్య సేవల మెరుగుదలకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారెవర్నీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే చీఫ్విప్ జీవీ శనివారం సాయంత్రం 04 గంటల సమయం లో స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.