Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: కంచరాంలో నాణాలతో గణనాధుడి విగ్రహం ఏర్పాటు, వినాయకుడిని చూసేందుకు తరలివస్తున్న భక్తులు

Vizianagaram, Vizianagaram | Aug 27, 2025
విజయనగరం జిల్లా రాజాం మండలంలోని కంచరాం గ్రామంలో నాణేలతో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం ఆకట్టుకుంటోంది. 7వేల వరకు రూపాయి, రెండు, పది రూపాయల నాణెములను ఉపయోగించి వినాయకుడిని తయారు చేశారు.. ఈ సంవత్సరం నాణెములతో చేయడం చాలా సంతోషంగా ఉందని, నిమజ్జనం రోజు అన్న సమారాధన చేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు... ప్రతి ఏటా వినూత్న రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేస్తూ వస్తున్నామన్నారు. నాణాలతో ఏర్పాటు చేసిన గణనాధుడిని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us