శ్రీ సత్య సాయి జిల్లా ఎన్ పి కుంట సమీపాన శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కుక్క అడ్డం వచ్చి ఆటో బోల్తా ఆటోలో ప్రయాణిస్తున్న చౌడంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. తలుపుల నుండి చౌడంపల్లికి ఆటోలో వెళుతుండగా ఎన్ పి కుంట సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.