నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో ఆదివారం రాజకీయ వాతావరణం మారింది. గ్రామానికి చెందిన 40 బీఆర్ఎస్ కుటుంబాలు ఆ పార్టీకి వీడ్కోలు పలికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో, గ్రామ కాంగ్రెస్ నాయకుడు ఎర్రబోయిన నర్సయ్య ఆధ్వర్యంలో జరిగాయి.