Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Aug 21, 2025
హయత్ నగర్ డివిజన్లోని రామకృష్ణ నగర్ లో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులతో పాటు సిసి రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us