మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఎక్కువగా నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని వారికి నాణ్యమైన భోజనం, విద్య అందేలా చూడాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలు, హాస్టల్లలో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.