చిత్తూరు: 15 మందికి భారీ జరిమానా చిత్తూరు నగరంలో జరిపిన వాహనాల తనిఖీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 15 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున 15 మందికి రూ.1.50 లక్షలు జరిమానాను జడ్జ్ ఉమాదేవి విధించినట్లు చెప్పారు. తొలిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, 2వ సారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా 3ఏళ్లు జైలు శిక్ష తప్పదు అని హెచ్చరించారు.