కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపంలో ఈరోజు ఉదయం మరియు సాయంత్రం వైభవంగా సంకటహర గణపతి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.ఓ. శ్రీ పెంచల కిషోర్, డి.ఎస్.పి. సాయినాథ్, ఆలయ ఏఈవో రవీంద్రబాబు, సూపరిండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు, చిట్టిబాబు, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.