బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.