ఆదోని మండలం పెద్దతుంబలంలోని నబీ ఎరువుల దుకాణంలో పట్టుబడిన స్పీక్ డీఏపీ ఎరువులు నకిలీవని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. కర్ణాటక నుంచి తెచ్చిన ఈ నకిలీ ఎరువులను రైతులకు విక్రయించినట్లు వ్యవసాయ శాఖ ఏఓ సుధాకర్ తెలిపారు. శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణ యజమాని ఇలియాస్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ మహేశ్ కుమార్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.