తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో 16 ఏళ్ల బాలికపై పై అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం జగ్గంపేట మండలం రామవరం గ్రామపంచాయతీ రంగవల్లి నగర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు-కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ గత కొద్ది రోజులు గోకవరంలో ఒక దళిత కుటుంబానికి చెందిన 16 బాలికను అమ్మాయిని గాంధీ,కిరణ్ అనే అబ్బాయిలు ప్రేమ పేరుతో మోసం చేసి ఆ అమ్మాయిని బంధించి,అతి కిరాతకంగా కొట్టి అత్యాచారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు