ఆళ్లగడ్డ మండలం ఓబులంపల్లెలో స్వామిత్ర సర్వేను గురువారం ఎంపీడీవో నూర్జహాన్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వామిత్ర పథకానికి ప్రజలు సహకరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సొంతదారులకు పట్టాలు అందజేయడం ఈ పథక లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.