బందరులో జనసేన ముసుగులో రెచ్చిపోతున్న రౌడీలు: వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని స్తానిక మచిలీపట్నం మండలంలోని సత్రపాలెం గ్రామంలో జనసేన పార్టీ ముసుగులో విర్రవీగుతున్న రౌడీలను అదుపు చేయాలని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో డిమాండ్ చేశారు. సత్రంపాలెంలో వైసీపీ కార్యకర్త గిరిధర్ పై దాడిని ఆయన ఖండించారు. పోలీసులు సైతం దాడికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.