పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉండే ఓటర్లు సొంతూళ్లకు చేరుకుంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాలకు పయనమయ్యారు. దీంతో ఆదివారం హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ తో పాటు ఏపీలో రేపు ఎన్నికలు ఉండడంతో శ్రీశైలం వెళ్లే ఓటర్లు సైతం సొంతూర్లకు వెళుతున్న పరిస్థితి