అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ మండలం పాల్తూరు గ్రామంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం లో నుంచి పడి సుంకమ్మ అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.