నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ను గురువారం ఆయన నివాసంలో నియోజకవర్గంలోని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి అందజేయగా, ఆయన వాటిని సవివరంగా తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే భాను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.