ఆముదాలవలసలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో బుదవారం ప్రపంచ రంగస్థలం కళాకారుల దినోత్సవ సందర్భంగా బుధవారం రాత్రి 8 గంటలకు కళాకారుల ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. గతంలో ఈ రంగస్థలం కళారంగానికి చాలా ఆరాధన ఉండేదని టీవీలు, స్మార్ట్ఫోన్లు వచ్చిన తర్వాత ఈ కళా రంగానికి చాలా ఆరాధన తగ్గిందని రానున్న రోజుల్లో ఈ పౌరాణిక నాటకాలు సాహిత్యాలు కనుమరుగు అవుతాయని తెలియజేశారు.