Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: గణేష్ నిమజ్జన ఉత్సవాలలో అపశృతి వ్యక్తి మృతి

Narayanpet, Narayanpet | Sep 6, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాలలో శనివారం అపశృతి చోటుచేసుకుంది. పేట మున్సిపాలిటీ లో మంచినీటి సరఫరా విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగ విధులు నిర్వహిస్తున్న శ్యాసన్ పల్లి శేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా నృత్యాలు చేస్తూ అనుకోకుండా కింద పడ్డాడు. ఈ విషయాన్ని తోటి స్నేహితులు గమనించి తేరు కున్నప్పటికీ పరిస్థితి విషమించింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు సి పి ఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రెండు గంటల సమయంలో తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us