మల్కాజిగిరి 141వ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్ అన్నపూర్ణ సొసైటీ భూ వివాదాలపై మీడియా సమావేశంలో స్పష్టత కోరారు. లేఅవుట్ ప్రకారం 8 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన సొసైటీ 10 ఎకరాలుగా ఎలా మారింది అన్నదానిపై సభ్యులు సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. కొంతమంది కావాలని తప్పుడు దృవపత్రాలు సృష్టించి, ఫ్లాట్లను రోడ్లుగా చూపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.