నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటుచేసిన డీజే వల్ల వృద్ధ దంపతులు ఉంటున్న ఓ మట్టిని కూలిందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. సుమారు 100 సంవత్సరాల మట్టిమిద్దే ముందు భాగం కూలిపోయిందని ఆ సమయంలో అక్కడ డీజే నే లేదని స్పష్టం చేశారు. వృద్ధ దంపతులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని తెలిపారు