ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా దొంగతనంగా ఇసుకను ఎవరైన తరలిస్తే కేసులు నమోదు చేసి జైలు కు పంపుతామని కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కరీంనగర్ రూరల్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి అఖిల్ ట్రాక్టర్ లో అక్రమంగా, దొంగతనముగా గొల్లపల్లి శివారులోని వాగు నుండి ఇసుక తరలిస్తుండగా డ్రైవర్ ని ట్రాక్టర్ తో సహా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.