అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె కు చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.