Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరీక్షలు

Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వద్ద ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు ప్రవాహపు అంచనా పరీక్షలు చేస్తున్నారు. ఏడీసీపీ (అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫెల్లర్) పరికరం బోటుకు అమర్చి పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ రీసెర్చ్ పవర్ స్టేషన్ శాస్త్రవేత్తలు శ్రీకాంత్,సంపత్, నాగరాజు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరీక్షలు నిర్వహించారు. బ్యారేజీకి 8,19,500క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ప్రత్యేకంగా బోటును తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ బోటుకు ఏడీసీపీ పరికరం అమర్చి ప్రవాహం అంచనా పరీక్షలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us