సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కృషి: ఎంపీపీ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్య క్రమం కింద సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చల్లపల్లి ఎంపీపీ విజయ రాధిక అన్నారు. బుధవారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డాక్టర్ అనగాని వెంకటరమణ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 9 ప్రాధాన్యత అంశాలపై ఎల్ఎస్జీజీఎస్ సదస్సు జరిగింది. ఈఓఆర్డీ రవిశంకర్, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి పాల్గొన్నారు.