Download Now Banner

This browser does not support the video element.

కొండపి: ఏపీలో ప్రజలకు పంపిణీ చేస్తున్న పెన్షన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది: మంత్రి స్వామి

Kondapi, Prakasam | Aug 21, 2025
పింఛన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించడం లేదని రీ వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుందన్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మీడియాకు మంత్రి స్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నేతల మాదిరి తాము తప్పుడు పనులు చేయమన్నారు. అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. కూటమి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే దానికి నిదర్శనం పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పేనన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us