సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో గౌడ సంఘo ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లికి గ్రామస్తులు బోనాల సమర్పించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ళు వాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిషాసుర మర్దిని గా అమ్మవారి అలంకరణ అందరిని ఆకట్టుకుంది.