జగిత్యాల పట్టణంలోని భవానీ నగర్ లోని తెలంగాణా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ను నాయకులతో కలసి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సందర్శించారు. హాస్టల్ లోని స్టోర్ రూమ్, వంట గదిని, పరిశీలించి అనంతరం మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ 10 సంవత్సరాల్లో విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విద్యార్థుల భోజన మెస్ చార్జీలు సరిపోవడం లేదని మెస్ చార్జీలు ప్రభుత్వం పెంచడం జరిగిందని అలాగే బాలికలకి కాస్మొటిక్ చార్జీలు కూడా పెంచడం జరిగిందని తెలిపారు.